రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలో ఎంపీటీసీ బైరినేని రాము ఆధ్వర్యంలో బలగం సినిమాను శనివారం రాత్రి ప్రదర్శించారు.భారీ సంఖ్యలో జనం హాజరై సినిమాను ఆసక్తిగా తిలకించారు.
సినిమాలో కొన్ని సన్నివేశాలను చూసి మహిళలు కంటతడి పెట్టుకున్నారు.సమాజంలో రక్త సంబంధాలు ఎలా ఉంటాయో కళ్ళము కట్టినట్టుగా సినిమాలో చూపించారని మానవ సంబంధాల గురించి సినిమాలో వర్ణించిన తీరు చాలా బాగుందని ప్రజలు అభినందించారు.