కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిని సన్మానించిన మండల కాంగ్రెస్ కమిటీ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన వంగ మల్లారెడ్డి జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ( Congress party )కాంగ్రెస్ కమిటీ ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చినందుకు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి ,పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి( Revanth Reddy )కి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

 Mandal Congress Committee Honored Kisan Cell District General Secretary-TeluguStop.com

ఈ ఎన్నికల తరుణంలో పార్టీ బాధ్యతలు అప్పగించినందున అభ్యర్థి గెలుపు కోసం మల్లారెడ్డి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, మండల కాంగ్రెస్ పార్టీ ( Congress party ) అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube