రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన వంగ మల్లారెడ్డి జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ( Congress party )కాంగ్రెస్ కమిటీ ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చినందుకు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి ,పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి( Revanth Reddy )కి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
ఈ ఎన్నికల తరుణంలో పార్టీ బాధ్యతలు అప్పగించినందున అభ్యర్థి గెలుపు కోసం మల్లారెడ్డి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, మండల కాంగ్రెస్ పార్టీ ( Congress party ) అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.