ఇల్లంతకుంట:తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈనెల 12-03-2023 న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తలపెట్టిన ఉద్యమకారుల ఆత్మ గౌరవ సదస్సుకు ఉద్యమకారులు పెద్దఎత్తున తరలిరావాలని మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రం లో బట్టీ చంద్రమౌళి ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఇల్లంతకుంట మండల మండల పరిధిలో గల తెలంగాణ ఉద్యమకారులు హాజరై తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి ఉద్యమకారులు అందరికీ న్యాయం చేయాలని వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరడం జరుగుతుందని తెలిపారు.
Latest Rajanna Sircilla News