మధుమేహం లేదా షుగర్ వ్యాధి దీనిని డయాబెటిస్ అని కూడా అంటారు.రకరకాల పేర్లు ఉన్నప్పటికీ జబ్బు మాత్రం ఒక్కటే.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మందిని వేధిస్తున్న ఈ షుగర్ వ్యాధిని పూర్తిగా నివారించే చికిత్స లేనప్పటికీ.అదుపు చేసే మందులు మాత్రం అందుబాటలోనే ఉన్నాయి.
ఇక న్యాచురల్ పద్ధతుల్లోనూ బ్లడ్ షుగర్ లెవల్స్ను కంట్రోల్ చేసుకోవచ్చు.ముఖ్యంగా తేనె, అల్లం కాంబినేషన్ మధుమేహాన్ని అదుపు చేయడంలోనే గ్రేట్గా సహాయపడుతుంది.
సాధారణంగా తేనె, అల్లం విడి విడిగా రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అయితే కలిపి తీసుకుంటే.అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు.అవును, తేనెలో చిన్న అల్లం ముక్క నాన బెట్టి.
ఉదయాన్ని తీసుకోవాలి.ఇలా ప్రతి రోజు మధుమేహం వ్యాధి గ్రస్తులు తీసుకుంటే గనుక.
రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి.తేనెలో అల్లం నానబెట్టి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
నేటి కాలం చాలా మంది మైగ్రేన్ బారిన పడుతున్నారు.మైగ్రేన్ సమస్య ఉంటే వారు ప్రశాంతగా అస్సలు ఉండలేరు.ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేరు.అయితే మైగ్రేన్ సమస్యను దూరం చేసుకోవాలని భావించే వారు తేనెలో అల్లం నానబెట్టుకుని తీసుకుంటే.మంచి ఉపశమనం లభిస్తుంది.మైగ్రేన్ నొప్పినే కాదు.
కీళ్ల నొప్పులు, కాలు నొప్పులు, నెలసరి నొప్పులను కూడా తేనె, అల్లం కాంబినేషన్ నివారించగలదు.
అలాగే అల్లం తేనె మిశ్రమంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.కాబట్టి, ఉదయం పూట ఈ మిశ్రమాన్ని తీసుకుంటే రోజంతా ఫుల్ యాక్టివ్గా మరియు చురుకుగా ఉంటారు.అదే సమయంలో శరీరంలో కొవ్వు కూడా కరుగుతుంది.
ఇక ప్రస్తుతం చలి కాలం కొనసాగుతుందని కాబట్టి.ఈ సీజన్లో ఆస్తమా బాధితులు చాలా ఇబ్బంది పడుతుంటారు.
అయితే రెగ్యులర్గా తేనెలో అల్లం నానబెట్టి తీసుకుంటే.ఆస్తమా లక్షణాలకు దూరంగా ఉండొచ్చు.
మరియు జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయి.