కూలిన భవనం ...తప్పిన ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో ఇటీవల గొడకూలి తల్లి కూతుర్లు చనిపోగా అట్టి సంఘటన మరవక ముందే అట్లాంటిదే మరో సంఘటన తృటిలో తప్పింది .మరో సంఘటన జరిగిన ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయితీ పరిధిలోని కిషన్ దాస్ పేట కు చెందిన ఒగ్గు శివ కుమార్ గత 20 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకుని కుటుంబం తో సహా నివాసముంటున్నాడు .

 Collapsed Building Near Miss , Shiva Kumar, Collapsed Building, Ellareddypet, Ne-TeluguStop.com

కాగా భవనం లో తన అన్న పిల్లలు తన పిల్లలు ఆడుకుంటుండగా వారిని అదృష్టవశత్తు పిల్లల నానమ్మ ఒగ్గు ఎల్లవ్వ పక్కన ఉన్న తన పెద్ద కుమారుడు ఒగ్గు ప్రవీణ్ ఇంట్లోకి పిలిచింది .పిల్లలు మనవిత్ ,అక్షయ్ సాత్విక్ , ,హర్షవర్ధన్ ను పిలిచింది .కాగా శివ కుమార్ ఇంట్లో ని పై కప్పు ఒక్క సారిగా ఫ్యాన్ తో సహా కుప్పకూలింది .పిల్లలు నలుగురు ప్రవీణ్ ఇంట్లోకి వెళ్లడంతో పెనుప్రమాదం జరిగేది తప్పింది .ఎలాంటి ప్రమాదం జరుగకపోవడం తో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు .సంఘటన జరిగినా సమాచారం తెలుసుకున్న మేజర్ గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ , మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ , సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి కి జరిగిన సంఘటన గురించి వివరించారు .వెంటనే అందించిన సర్పంచ్ పంచాయితీ కార్యదర్శి దేవరాజు సమాచారం ఇవ్వగా పంచాయతీ కార్యదర్శి సంఘటన స్థలాన్ని సందర్శించారు .గృహలక్ష్మి పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తే శివ కుమార్ ఇల్లు కట్టుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ని కోరారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube