పోతారం మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ గోలి మోహన్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ సర్పంచ్ ముస్కెం సత్యనారాయణ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ గోలి మోహన్( Dr.Goli Mohan )ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో సత్యనారాయణ గౌడ్ సర్పంచ్ గా పనిచేసినప్పటికీ ఆర్థికంగా ఎటువంటి వృద్ధి చెందకుండా పేద జీవితం గడుపుతున్నాడని ఆర్థికంగా చితికి పోవడంతో మనోవేదనకు గురై అనారోగ్యం పాలయ్యాడని తనకు భార్య, ఒకకూతురు ఉన్నారని తెలిపారు.డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ సత్యనారాయణ గౌడ్( Satyanarayana Goud) సర్పంచ్ గా పనిచేసినప్పటికీ ఆర్థికంగా లేకపోవడం, చిన్నతనంలోనే చనిపోవడం దురదృష్టకరమని అన్నారు.

 Brs Senior Leaders Dr. Goli Mohan Visited The Family Of Former Sarpanch Of Potha-TeluguStop.com

సత్యనారాయణ గౌడ్ కూతురు చదువుకు తన వంతు సహకారం అందిస్తానని మృతుడి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

చదువుతో ఎవరైనా కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని ఆర్థికంగా అభివృద్ధి చెందితే మానసికంగా, శారీరకంగా ఎటువంటి ఒత్తిడి లేక అకాల మరణాలు సంభవించవని అన్నారు.నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం తాను ఈసారి ఎన్నికల బరిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే నూతన ప్రణాళికలతో నియోజకవర్గం అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube