మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అరిజిన్ డెయిరీ నిర్వాహకురాలు శేజల్ సీబీఐకి ఫిర్యాదు చేశారు.కాగా దుర్గం చిన్నయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతరం శేజల్ మాట్లాడుతూ తెలంగాణ పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేకపోవడంతో సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ క్రమంలో తన వద్దనున్న ఆడియో టేప్స్, ఇతర ఆధారాలను సీబీఐకి ఇచ్చినట్లు వెల్లడించారు.