తప్పులపై ప్రశ్నిస్తే దాడి..: ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోందని చెప్పారు.

 Attack If Questioned On Mistakes..: Key Comments Of Mlc Kavitha-TeluguStop.com

ఇప్పటివరకు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని ఆమె ఆరోపించారు.ఆ విషయాన్ని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.

అంతేకాకుండా తప్పులపై ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.అపోజిషన్ పై దాడి చేస్తే ఏం జరుగుతుందన్న కవిత మహా అయితే ఒక టర్మ్ అధికారం పోతుందేమోనని తెలిపారు.

లీకులిచ్చి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వెల్లడించారు.కేంద్రం వ్యవస్థలను అనేక రకాలుగా వాడుకుంటుందని మండిపడ్డారు.

వ్యవస్థను మనం కాపాడుకుంటే.ఆ వ్యవస్థే మనల్ని కాపాడుతుందని ఆమె స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube