లోకంలో అమ్మనాన్న అనే వారు సూర్యచంద్రుల వంటి వారు.ఒకరు వెలుగుపంచితే, మరొకరు వెన్నెలవంటి ప్రేమను పంచుతారు.
ఈ రెండింటిలో ఎవరు లేకపోయిన జగతి ముందుకు సాగదు.కన్న పిల్లల బ్రతుల్లో కూడా ఏదో వెలితి.
అలాంటి ప్రేమలకు చిరునామగా ఉన్న తల్లిదండ్రులు స్వార్ధంతో ప్రవర్తించడం వల్ల కన్నవారు అంటే కర్కోఠకుల్లా మిగిలిపోతున్నారు.
ముఖ్యంగాకన్న కూతుళ్లపై తండ్రుల అరాచకాలకు అంతే లేకుండా పోతుంది.
ఇలాగే ప్రవర్తించిన ఓ తండ్రిని అతని కూతురే దారుణంగా చంపిన ఉందంతం వెలుగులోకి వచ్చింది.ఆ వివరాలు చూస్తే.
పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ మహిళ (22) రెండ్రోజుల క్రితం తన తండ్రికి ఫుల్లుగా మద్యం తాగించి, కడుపు నిండా తినిపించి, హుగ్లీ నది ఒడ్డుకు తీసుకెళ్లింది.కాగా మద్యం మత్తులో చిత్తైన అతను నిద్రపోగానే, ఇతని కూతురు కిరోసిన్ పోసి నిప్పంటించింది.
అయితే ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.దీంతో ఆ యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు విషయాన్ని రాబట్టగా తన తండ్రి అకృత్యాలను వెల్లడించి, ఆ బాధలు తట్టుకోలేక హత్యచేసినట్లు తెలియచేసింది.