టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్( Director Sujeeth ) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ఒక ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.పవన్ లైనప్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఇదే అని చెప్పాలి.
ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే పెరిగి పోయాయి.వరుస అప్డేట్ లను అందిస్తూ మరింత హోప్స్ పెంచుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ బయటకు వచ్చింది.
రీసెంట్ గానే మూడవ షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ లేడీ నటిస్తున్నట్టు తాజాగా అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేశారు.ఇటీవలే యంగ్ నటుడు అర్జున్ దాస్ నటిస్తున్నట్టు ప్రకటించగా ఇప్పుడు వెర్సటైల్ నటి శ్రీయా రెడ్డి( Sriya Reddy ) నటిస్తున్నట్టు ప్రకటించారు.
విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాలో నెగిటివ్ రోల్ లో మెప్పించిన బ్యూటీనే శ్రీయ రెడ్డి.
ఈ సినిమా ఇప్పటికి ఆడియెన్స్ కు బాగా గుర్తు ఉంది.ఈ భామ గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.అయితే సలార్ సినిమాలో నటిస్తున్నట్టు ఈ మధ్య ప్రకటన రాగా ఇప్పుడు పవన్ ఓజిలో కూడా భాగం అయినట్టు తెలుస్తుంది.
చూడాలి అమ్మడి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో.
కాగా మాసివ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
వేగంగా పూర్తి అవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.