మట్టితో గణపతిని వినాయక చవితి( Vinayaka Chavithi ) సందర్భంగా తయారుచేసిన బాలుడు చెట్కూరి సాయి చరణ్ తయారుచేసి పలువురి మన్ననలు పొందారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చెట్కూరి సాయి చరణ్ 8వ తరగతి చదువుతున్నాడు.
మట్టి వినాయకులను పూజించాలనే తపనతో మట్టితో వినాయకుని( Clay Ganesha ) ప్రతిమ తో పాటు శివలింగాన్ని, చేతిలో త్రిశూలం ఆకృతులను తయారు చేసి అనంతరం కలర్లను అద్దాడు పర్యావరణాన్ని కాపాడుటకు మట్టి విగ్రహాన్ని తయారు చేశానని బాలుడు పేర్కొన్నారు.గతంలో అనేక చిత్రాలను స్కెచ్ పెన్నులతో గీస్తూ పాఠశాలలో ప్రదర్శించాడు.