జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర మొదటి విడత ఇవాళ్టితో ముగియనుంది.ఈ మేరకు యాత్ర ముగింపు సందర్భంగా సాయంత్రం భీమవరంలో సభ జరగనుంది.
భీమవరం సభలో కీలక విషయాలు చెబుతానని జనసేనాని ఇదివరకే ప్రకటించారు.ఈ నేపథ్ంయలో పవన్ సభపై జన సైనికులు భారీ అంచనాలు పెట్టుకున్నారని తెలుస్తోంది.
అయితే భీమవరంలోనే పవన్ పోటీ చేస్తారంటూ పొలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే.కాగా సభా వేదికగా అధికార పార్టీ వైసీపీపై మరోసారి విమర్శలు చేసే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే జనసేన తదుపరి షెడ్యూల్ ను కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.దాదాపు పది నియోజకవర్గాల్లో వారాహి యాత్ర కొనసాగగా భీమవరం సభ తర్వాత స్వల్ప విరామం ఇవ్వనున్నారని సమాచారం.