చాలా మంది కొన్ని సందర్భాలలో రెండు వేల నోటు బురదలో పడితే దాని విలువ మారదు కదా అని చెబుతూ ఉంటారు.అయితే కేవలం సందర్భానుసారం మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా విలువైన వస్తువులు మురికిలో పడి ఉంటే వాటిని వెంటనే తీయాలి.
అలా కాకుండా బురద అంటుంది కదా అని తీయడానికి ఆలోచించకూడదు.బంగారం, వజ్రం లేదా వెండి వంటి విలువైన వస్తువులు మురికిలో పడి ఉంటే వెంటనే వాటిని తీయాలి.
అలా వాటిని తీయకపోతే వాటికి వాటిని అవమానించినట్లే అవుతుంది.
అంటే విలువైన వస్తువులు మురికిలో పడిన, బురదలో పడినా కూడా వాటి విలువ తగ్గదు అని అర్థం చేసుకోవచ్చు.అదే విధంగా ప్రతి మనిషిలో చెడు గుణాలు తప్పకుండా ఉంటాయి.కాబట్టి ఎల్లప్పుడూ చెడు గుణాలు ఉన్న వారికి దూరమవుతూ, మంచి గుణాలు ఉన్నవారి దగ్గర మంచి గుణాలను నేర్చుకొనే విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు.
ఇలా మంచి గుణాలను నేర్చుకోవడంలో ముందడుగు వేసే వారు జీవితంలో పురోగతిని పొందడంతో పాటు గొప్ప పేరు ప్రతిష్టను కూడా పొందుతారు.అలాగే ఎప్పుడు కూడా బంగారం, వెండి, డబ్బు కూడా మురికిలో పడిన కూడా దాని విలువ తగ్గదు.
అందువల్ల ఒక వ్యక్తి మురికిలో పడి ఉన్న డబ్బును చూస్తే వెంటనే దాన్ని బయటికి తీయాలి.కాబట్టి మంచి గుణాలు నేర్చుకోవడం వల్ల మంచి బుద్ధులు రావడంతో నడవడిక బాగుంటుంది.
అలా బురదలో పడిన ఎటువంటి విలువైన వస్తువు అయినా సరే దాన్ని తీయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయి.దాని వల్ల మీరు త్వరగా ధనవంతులు అవుతారు.
LATEST NEWS - TELUGU