ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల 14వ తేదీ నుంచి మొదలైన దీప యజ్ఞం, కోటి దీపోత్సవం( Koti Deepotsavam ) ఎనిమిదో రోజును పూర్తి చేసుకుంది.“దీపం జ్యోతిః పరబ్రహ్మం.“దీపేన సాధ్యతే సర్వం.సంధ్యాదీప నమోస్తుతే అంటారు.
ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు.దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగుల మయం అవుతుందని పండితులు( Scholars ) చెబుతున్నారు.
అదే ఒకే చోట కోటి దీపాలను వెలిగించి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.అలాగే లక్ష దీపాలతో ప్రారంభమైన ఈ మహా యజ్ఞం కోటికి చేరుకుని తెలుగు రాష్ట్రాలలోని భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటూ ఉంది.

ఇంకా చెప్పాలంటే ఎనిమిదవ రోజుకు చేరిన కోటి దీపోత్సవం వేడుకలు ఎలా జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే నాగ సాధువులచే మహా రుద్రాభిషేకం.( Maha Rudrabhishekam )ఇంకా చెప్పాలంటే సౌభాగ్యదాయకం.సర్వమంగళదాయకం భక్తులచే అమ్మలగన్న అమ్మకి కోటి గాజుల అర్చన జరిగింది.అలాగే ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కళ్యాణం ( Kanakadurgamma Kalyanam )కూడా జరిగింది.సింహ వాహనం పై ఆదిపరా శక్తి అద్భుత సాక్షాత్కారం అయింది.
అలాగే కంచి కామాక్షి దేవి, కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శన భాగ్యం కూడా కలిగింది.మైసూర్ అవధూత దత్త పీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీర్వచనం కూడా జరిగింది.

అలాగే ఉడుపి పెజావర్ మఠం శ్రీవిశ్వప్రసన్న తీర్థ స్వామి ఆశీర్వచనం కూడా జరిగింది.పద్మశ్రీ గరికపాటి నాగేశ్వరరావు ప్రవచనామృతం కూడా భక్తులు విన్నారు.అద్భుత కళా సంబరాలు, అద్వితీయ భక్తినీరాజనాలు కూడా జరిగాయి.ఇలా ఎన్నో అద్భుత ఘట్టాలకు భక్తి టీవీ వేదికగా మారింది.ఈ దీప యజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజా సామాగ్రి, దీపారాధన వస్తువులను ఉచితంగా అందించింది.హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన కోటి దీపోత్సవంలో చాలా మంది భక్తులు( devotees ) పాల్గొన్నారు.