సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వివాహాలు ఇతర ఏ రకమైన వేడుకల్లోనైనా, ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా, ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా డీజేతో శబ్ద కాలుష్యాన్ని చేయకూడదని కోదాడ పట్టణ సిఐ రాము అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో డీజే ఓనర్లు,ఆపరేటర్లకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమిస్తే డీజే ఆపరేటర్లపై,వేడుక నిర్వహించే వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకొని,డీజేలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.డీజే ఓనర్లు,ఆపరేటర్లు పోలీస్ వారికి సహకరించాలని కోరారు.