లిఫ్టు సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి:రైతు సంఘం నేత బెల్లంకొండ

సూర్యాపేట జిల్లా:1996 నుండి నేటి వరకు లిఫ్టు ఇరిగేషన్ పథకం( Lift Irrigation Scheme )లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రైతు సంఘం సూర్యాపేట జిల్లా సహయ కారదర్శి బెల్లంకొండ సత్యనారాయణ ( Bellamkonda Satyanarayana )రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy )ని కోరారు.

 Lift Staff Should Be Recognized As Government Employees: Rythu Sangham Leader Be-TeluguStop.com

సోమవారం నడిగూడెం మండల కేంద్రంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువల ఎత్తిపోతల యూనియన్ గౌరవ అధ్యక్షుడు పందిరి శ్రీనివాస్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కొరట్ల ప్రసాద్( Nagarjunasagar ) తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం హైదరాబాదులో మంత్రి లిఫ్ట్ ల మీద సమీక్ష సమావేశం నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

లిఫ్టులలో సుమారుగా గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఉన్నా లేకున్నా లిఫ్ట్ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నారని, అలాంటి సిబ్బందిని అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి తర్ఫీదు ఇవ్వాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube