సూర్యాపేట జిల్లా: కోదాడ మున్సిపాలిటీ పక్కన గల సీతారామ కళ్యాణ మండపం నందు గత 50 సంవత్సరాలుగా చిన్నచిన్న డబ్బాకొట్లు ఏర్పాటు చేసుకొని పేదలు ఉపాధి పొందుతున్నారని, ఆ డబ్బాకొట్లను తొలగించకుండా సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్.నయీమ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు గురువారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఈ స్థలంలో చిన్న,చిన్న డబ్బా కొట్లు ఏర్పాటు చేసుకొని అనేకమంది పేదలు ఉపాధి పొందుతున్నారని, మున్సిపల్ సిబ్బంది వచ్చి దుకాణాలను తొలగిస్తామని భయభ్రాంతులకు గురి చేయడం సరైనది కాదన్నారు.వెంటనే ఆ స్థలంలో పక్కా నిర్మాణాలు చేపట్టి,ఎన్నో ఏండ్లుగా ఉంటున్న వారికి దుకాణాలను కేటాయించి చిరు వ్యాపారులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దొంగరి శ్రీను,సైదులు,పాండు, రంగారావు,నరహరి, అబ్దుల్,రహీం,జానీ, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.