ట్రాన్స్ఫారంకే ఎసరు పెట్టిన దొంగలు

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల( Ananthagiri mandal ) పరిధిలోని శాంతినగర్ గ్రామ శివారులో ఉన్న పొలాల్లో మోటర్లు రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.15 రోజుల క్రితం లింగయ్య అనే రైతు మోటారును దొంగలు ఎత్తుకెళ్లారు.అది మరవక ముందే గ్రామ శివారులో ఉన్న ట్రాన్స్ఫారం ఎత్తుకెళ్లాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో దిమ్మే నుండి కింద పడేసి వెళ్లిపోయారు.

 Thieves Who Attacked The Transformer , Ananthagiri Mandal, Suryapet District ,-TeluguStop.com

పడేసిన ట్రాన్స్ఫారం( Transformer ) అలాగే వదిలేస్తే రెండు మూడు రోజుల్లో ఎత్తుకెళ్తారని గ్రామస్తులు అంటున్నారు.

కోదాడ-ఖమ్మం జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఈ దొంగతనాలు ఎక్కువయ్యాయని భావించిన రైతులు( Formers ) అప్రమత్తమయ్యారు.రాత్రిపూట కూడా పొలాల వద్దకు కాపలా వెళుతున్నట్లు తెలుస్తోంది.

దొంగలను అదుపు చేయాలంటే పోలీసులు రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించాలని,రైతుల మోటార్ల దొంగ తనాలకు పాల్పడుతున్న వారిని త్వరగా పట్టుకొని చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube