చంద్రబాబు తరపు లాయర్లపై ఏసీబీ కోర్టు జడ్జి ఆగ్రహం

టీడీపీ అధినేత చంద్రబాబు తరపు న్యాయవాదులపై విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.ఈ మేరకు వరుస పిటిషన్లు దాఖలు చేస్తే విధులు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

 Acb Court Judge Is Angry With Chandrababu's Lawyers-TeluguStop.com

ఆర్డర్స్ సమయానికి కొత్త పిటిషన్లు వేస్తున్నారని మండిపడ్డారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కోర్టు ప్రొసీజర్స్ కూడా పాటించడం లేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

ఈ నేపథ్యంలో పిటిషన్ దాఖలు చేయాలనుకుంటే మధ్యాహ్నం 12 గంటల లోపు వేయాలని సూచించారు.అదేవిధంగా నేరుగా పిటిషన్ వేసి వాదనలు వినాలనడం సరికాదని న్యాయమూర్తి వెల్లడించారని తెలుస్తోంది.

కాగా చంద్రబాబు తరపున ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి డాక్యుమెంట్ల పరిశీలనకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే సెక్షన్ 207 సీఆర్పీసీ కింద అనుమతి ఇవ్వాలని న్యాయవాది కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube