ఉపాసన చరణ్ లకు( Ram Charan Upasana ) పండంటి పాప జన్మించడం మెగా అభిమానులకు సంతోషాన్ని కలిగించిందనే సంగతి తెలిసిందే.చిన్నారికి తాతయ్య కావడంతో మెగాస్టార్ కూడా చాలా సంతోషంతో ఉన్నారని రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తోంది.
మరోవైపు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి యాత్రలో( Varahi Yatra ) పాల్గొనగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొందరు స్పీచ్ ముగిసిన తర్వాత సరదాగా పవన్ తాతయ్య అయ్యారంటూ కామెంట్లు చేశారు.
అయితే చిన్నారికి తాతయ్య అయ్యారంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేయగా పవన్ సిగ్గు పడుతూ చిరునవ్వు నవ్వారు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ఘాటు వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలపై అంచనాలు పెరుగుతుండగా బ్రో మూవీ ప్రమోషన్స్ త్వరలో మొదలుకానున్నాయి.
బ్రో సినిమా రిలీజ్ కు నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెరగాలని పవన్ ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.బ్రో సినిమా రీమేక్ అయినా ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి కీలక మార్పులు జరిగాయని సమాచారం అందుతోంది.బ్రో సినిమా ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుందని తెలుస్తోంది.త్రివిక్రమ్ మార్క్ చమక్కులు ఈ సినిమాలో ఉండనున్నాయని సమాచారం.
బ్రో సినిమా 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు 180 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా పవన్ తో సినిమాలు తీసిన నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలు మిగులుతున్నాయి.బ్రో సినిమా కమర్షియల్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.సాయితేజ్ సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయని సమాచారం అందుతోంది.