నల్లగొండ జిల్లా:టిఎస్ఎస్పి అన్నెపర్తి 12 వ బెటాలియన్ కమాండెంట్ ఎన్.వి.
సాంబయ్య ఆధ్వర్యంలో ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అదనపు కమాండెంట్ బి.రామకృష్ణ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామాయణాన్ని మధురకావ్యంగా మలిచి మానవజాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహనీయుడు ఆదికవి వాల్మీకి మహర్షి అని,ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నర్సింగ్ వెంకన్న,ఆర్ఐలు బి.అశోక్,వై.యుగందర్,టి.వెంకన్న మరియు ఆర్ఎస్ఐలు ఇతర సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు.