యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, రోడ్డు పనుల కార్మికులపై దుసుకేల్లిన బస్సు..ముగ్గురు మృతి .

భువనగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం రోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.కూలి పనులు చేస్తున్న కార్మికులపై మృత్యు రూపంలో వచ్చిన ఆర్టీసీ బస్సు వారి ప్రాణాలను కబళించింది.

 Three Killed In Road Mishap In Yadadri District-TeluguStop.com

వివరాల్లోకి వెళితే హెచ్ఎంటి కాంట్రాక్టు సంస్థలో గత కొంత కాలంగా రాయగిరి-వరంగల్ రోడ్డు పనులు నడుస్తున్నాయి.అందులో భాగంగా ఆదివారం రోజు రోడ్డుపై ప్రమాద సూచికలను ఏర్పాటు చేస్తున్నటువంటి కూలిలపై వరంగల్ నుండి హైదరాబాద్ వెళుతున్న డీలక్స్ బస్సు దూసుకెళ్లడంతో అంకర్ల లక్ష్మీ,ఊరేళ్ళ శ్యామ్,అంకర్ల కవిత అక్కడిక్కడే మృతి చెందరు.

వీరి మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి.కార్మికులను ఢీ కొట్టిన అనంతరం అక్కడే పక్కకు ఆగి ఉన్న ట్రాక్టర్ ని బస్సు డీకొనడంతో ట్రాక్టర్ మొత్తం నుజ్జునుజ్జు అయింది.

మృతులంతా భువనగిరి మండలం రాయగిరి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.పోలీసులు సంఘటన స్థలాని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube