నల్లగొండ జిల్లా:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి,పర్యటనల నిమిత్తం రూ.100 కోట్లు పెట్టి ప్రత్యేక విమానం కొనుగోలు చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు జిల్లాలో దానిపై ఓ ప్రత్యేక చర్చ జోరుగా సాగుతోంది.కేసీఆర్ విమానం కొనేందుకు నల్లగొండ జిల్లాకు చెందిన నేతలు భారీ విరాళం అందజేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆ నేతలు ఎవరా? అని జిల్లా వ్యాప్తంగా ప్రజలు చేస్తున్న చర్చ ఆసక్తి రేపుతోంది.