ఒకే జానర్ సినిమాలలో నటిస్తున్న తండ్రులు కొడుకులు.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోలు స్టార్ హీరోలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోగా ఈ హీరోల కొడుకులు సైతం తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడం గమనార్హం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వేర్వేరు జానర్స్ లో సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఒకే జానర్ లో తెరకెక్కుతున్న సినిమాలలో తండ్రులు కొడుకులు నటిస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. చిరంజీవి మోహన్ రాజా కాంబోలో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.

పొలిటికల్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం గమనార్హం.

ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్లలో విడుదల కానుంది.సీనియర్ హీరోలలో ఒకరైన నాగార్జున ప్రస్తుతం ది ఘోస్ట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

స్పై అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఏజెంట్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా కూడా స్పై అడ్వెంచరస్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.

అఖిల్ కు జోడీగా ఈ సినిమాలో సాక్షి వైద్య నటిస్తుండటం గమనార్హం.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఏజెంట్ మూవీ తెరకెక్కుతోంది.తండ్రులు కొడుకులు ఒకే జానర్ సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలలో ఏ సినిమాలు సక్సెస్ సాధిస్తాయో చూడాల్సి ఉంది.చిరంజీవి, నాగార్జున భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం సంచలన విజయాలను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

అఖిల్, చరణ్ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు