నల్లగొండ జిల్లా:ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తానన్న రిజర్వేషన్ ఏమైందని, గజ్వేల్ లో ఇళ్లు కట్టించిన కేసీఆర్ నల్గొండలో ఎందుకు కట్టలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి నాలుగున్నర నెలల సమయమే ఉందని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని,మా హయాంలో వంటగ్యాస్ ను రూ.500 కే అందిస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా నల్గొండలో భారీ సభ నిర్వహిస్తామని,నల్గొండ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానించామని,ఆమె వస్తానన్నారని తెలిపారు.
అందరూ బాగుండాలని ఉపవాస దీక్ష చేసే పండుగ రంజాన్ పండుగని,సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింలలో 98 శాతం పేదవాళ్లు ఉన్నారని తెలిసి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చామని గుర్తు చేశారు.సుప్రీంకోర్టు ఒప్పుకోకుంటే రిజర్వేషన్ కోసం పోరాడి సాధిచుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని,12 శాతం రిజర్వేషన్ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు ఎందుకు చేయలేదని,9 ఏళ్లు గడిచిపోయాయినా ఇంతవరకు హామీ నెరవేర్చలేదని,కనీసం 8 శాతానికి కూడా పెంచలేదన్నారు.
తమిళనాడులో మాదిరిగా పెంచే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న గ్రామంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టలేదని,నా హయాంలో నల్గొండ ఈద్గా దగ్గరలో రాజీవ్ గృహకల్ప కింద 300 ఇళ్లు కట్టించానని,ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని,సొంత జాగా ఉంటే లక్ష రూపాయలు ఇచ్చామని,కానీ,డబుల్ బెడ్రూం అని చెప్పిన కేసీఆర్ నల్గొండలో దళితులు,ముస్లింలు, పేదవాళ్లను మోసం చేశారని విరుచుకుపడ్డారు.
దత్తత అని చెప్పి ఏం చేశారని,గజ్వేల్ లో 5వేల ఇళ్లు కట్టించిన కేసీఆర్, నల్గొండలో ఎందుకు కట్టలేదని నిలదీశారు.
ఎమ్మెల్యే తండ్రి చనిపోతే వచ్చి మెయిన్ రోడ్ ఒక్కటి వేస్తే సరిపోతుందా? ఆ ఒక్క రోడ్ తో నల్గొండ అభివృద్ధి కాదని,పేదలకు ఇళ్లు కట్టినప్పుడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు అభివృద్ధి జరుగుతుందన్నారు.మూడున్నర లక్షల మంది విద్యార్థులు టీఆర్టీ ఎగ్జామ్ కోసం ఎదురుచూస్తున్నారని, దాని గురించి కేసీఆర్ పట్టించుకోవడం లేదని, ఉర్దూ మీడియంలో సెలెక్షన్స్ లేవని విమర్శించారు.నాలుగున్నర నెలల సమయమే ఉందని, వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని,గతంలో సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి లక్ష రూపాయలు ఎలా ఇచ్చామో,ఈసారి 5 లక్షలు ఇస్తామని హామీ ఇస్తున్నామన్నరు.
భువనగిరికి ఎంపీనే అయినా నల్గొండలో ఎవరికి ఏ కష్టమొచ్చినా అండగా ఉంటున్నానని, నల్గొండ నుంచి ఈసారి కోమటిరెడ్డి పోటా చేస్తారా? లేదా? అనే వార్తలు వస్తున్నాయని,మీకు డౌట్ అవసరం లేదని,ఆరు నెలల క్రితమే క్లారిటీ ఇచ్చానని,నల్గొండ నుంచి ముమ్మాటికీ పోటీ చేస్తానని,తెలంగాణలో అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.ఎన్నో ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని,ప్రజలకు సంతోషమున్నా, దు:ఖమున్నా వారికి నేనున్నాననే భరోసా కల్పిస్తున్నానని, మీడియాలో తప్పుడు కథనాలు రాయొద్దన్నారు.నల్గొండ నుంచి నేను పోటీ చేయడం ఖాయమని, ఈసారి ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందన్నారు.అన్ని వర్గాల ప్రజలు నాకు తోడున్నారని,ఓసారి ఇప్పుడున్న నాయకులు చేసింది,నేను చేసింది గుర్తు చేసుకోండని కోరారు.
సరైన బాత్రూంలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే15 లక్షలు ఖర్చు చేసి కట్టించానని, నేను ఎమ్మెల్యే కాకపోయినా ప్రజలకు మంచి చేయాలనేదే నా తాపత్రయమన్నారు.ముస్లిం మతపెద్దలు మౌలానా ఇల్లు కాలిపోతే.నేను ఢిల్లీలో ఉన్నప్పుడు విషయం తెలిసి వెంటనే వచ్చానని,ఇవన్నీ ఓట్ల కోసం కాదని,పేదలు బాగుండాలన్నదే నా గుణమన్నారుదేశంలో అన్ని ధరలు పెరిగిపోతున్నాయని, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారని,ప్రధాని మోడీ ఇంటికో ఉద్యోమన్నారని,.15 లక్షలు ఇస్తానన్నారని, ఎక్కడా ఉద్యోగాలు లేవు, 15 లక్షలు ఇచ్చింది లేదనిఎద్దేవా చేశారు.వంటగ్యాస్ మాత్రం 15 వందలు చేశారని,కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సబ్సిడీ భరిస్తూ 500 రూపాయలకే వంటగ్యాస్ అందిస్తామని భరోసా ఇచ్చారు.భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర భువనగిరి నియోజకవర్గం,అలాగే నల్గొండ మీదుగా ఖమ్మం వెళ్తుందని,నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నరు.
ఈ సభకు ప్రియాంక గాంధీని తీసుకురావాలని చూస్తున్నామని,ఈ విషయాన్ని ఆమెకు చెప్పామని, సానుకూలంగానే మాట్లాడారని,నల్గొండలో ప్రియాంక గాంధీతో సభ ఉంటుందన్నారు.