ఎన్నికై ఎనిమిది నెలలు అవుతున్నా ఒక్క పైసా నిధులు తేలేదు: మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల

నల్లగొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికై ఎనిమిది నెలలు అవుతున్నా నేటికీ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్కపైసా నిధులు తేలేదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.మంగళవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు,

 Eight Months Since The Election But Not A Single Penny Has Been Raised Former Ml-TeluguStop.com

మండల అభివృద్ధికి రూ.25 కొట్ల జిహెచ్ఎంసి నిధులు తీసుకువచ్చి శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు.ఆ పనులు కూడా పూర్తి చేయకుండా ఎక్కడికక్కడ నిలిపివేయడం సమంజసం కాదన్నారు.అభివృద్ధిని గాలికొదిలేసి,రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube