కారు సర్కార్ గడువు ముగిసింది: బత్తుల లక్ష్మారెడ్డి

నల్లగొండ జిల్లా: తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ కు గడువు ముగిసిందని,కాంగ్రెస్ అధికారంలోకి రావాలి మా బ్రతుకుల్లో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

నల్లగొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని శెట్టిపాలెం, మొలకపట్నం,అన్నపురెడ్డి గూడెం,తాళ్లగడ్డ,ఎరుకల గుట్ట,రావులపెంట తదితర గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ అభివృద్ధికి కేరాఫ్ గా మారుస్తామన్నారు.

నియోజకవర్గ ప్రజలకు ఉపాధి కల్పన అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టడం,ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చిన హామీలు అమలు చేశారన్నారు.

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని,డబుల్ బెడ్ రూమ్,రుణమాఫీ హామీలను తుంగలో తొక్కిందన్నారు.నిరుద్యోగ భృతి అంశాన్ని అట్టకెక్కించి,ఉద్యోగ నోటిఫికేషన్ లను రద్దుపరిచి వారిని వీధిన పడేసిందని విమర్శించారు.

Advertisement

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల వేళ ప్రలోభాలకు గురిచేసి, గెలిచిన అనంతరం సమస్యలను పట్టించుకోలేదని,ఆ పార్టీ నాయకులను సైతం విస్మరించారని ఆరోపించారు.బీఆర్ఎస్ పార్టీలో చేరకపోతే దళిత బీసీ బంధు ఇవ్వమని భయభ్రాంతులకు గురి చేస్తూ గులాబీ కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు.

మిర్యాలగూడను అభివృద్ధి చేసేందుకు హస్తం గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News