భక్తులకు చేసే సేవే భగవంతుని సేవ: సీపీ మహేశ్ భగవత్

యాదాద్రి జిల్లా:యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ ఐపీఎస్ యాదాద్రి ఆలయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.ఆలయ ప్రాంగణాన్ని సీపీ పర్యవేక్షించి మార్చి 28న నిర్వహించనున్న ఆలయ ప్రారంభోత్సవ వేడుకలకు భద్రతాపరమైన ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు.

 Service To The Lord Is Service To The Devotees: Cp Mahesh Bhagwat-TeluguStop.com

మీడియాతో మాట్లాడుతూ మార్చి 28వ తేదీ సోమవారం సిఎం కె.చంద్రశేఖరరావు ఆలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.ప్రారంభోత్సవానికి రాచకొండ పోలీసుల ద్వారా అన్ని రకాల సెక్యూరిటీ ప్రోటోకాల్‌లు అందజేస్తామని,ఆలయ ప్రాంగణంలో సీసీటీవీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ఆలయ పరిరక్షణకు ఎస్పీఎఫ్‌కు చెందిన ప్రత్యేక బృందాన్ని నియమిస్తామని పేర్కొన్నారు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని,ఆలయ ప్రాంగణంలో సివిల్‌ పోలీస్‌ బృందాల ద్వారా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, మహిళా భక్తుల సహాయార్థం షీ టీమ్‌లను కూడా నియమిస్తామని తెలిపారు.పోలీసులు సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను భక్తులు పాటించాలని సూచించారు.

ఈ తనిఖీలో డీసీపీ కె.నారాయణరెడ్డి ఐపీఎస్,ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube