డ్యూటీకి వెళ్లి సాగర్ కాలువలో శవమై తేలాడు

నల్లగొండ జిల్లా: గురువారం ఉదయం డ్యూటీకి వెళ్ళిన వ్యక్తి సాగర్ ఎడమ కాలువలో శవమై తేలిన సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda)మండలంలో వెలుగులోకి వచ్చింది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… తక్కేళ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని బండమీద గూడెం</em(Bandamida gudem) గ్రామానికి చెందిన నారబోయిన హరికృష్ణ(Naraboina Harikrishna) (32)గురువారం పెద్దదేవులపల్లిలోని రెడ్డీస్ ఫ్యాక్టరీ(Reddy’s Factory)లో డ్యూటీకి వెళ్ళాడు.

 Went To Duty And Floated Dead In Sagar Canal, Sagar Canal, Miryalaguda, Bandamid-TeluguStop.com

సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా వేములపల్లి సమీపంలో బిడ్జ్ సాగర్ కాల్వకట్టలపై బైకు, చెప్పులు లభ్యమయ్యాయి.అనుమానంతో సాగర్ కాలువలో వెతకగా సూర్యాపేట జిల్లా మేడారం వద్ద శుక్రవారం ఉదయం మృతదేహం లభించింది.

హరికృష్ణ అత్తగారి ఊరు పెద్దదేవులపల్లి కావడం,ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరగటంతో హరికృష్ణ మృతిపై అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube