తాటి,ఈత చెట్లను తొలగించిన రియల్ ఎస్టేట్ మాఫియా

యాదాద్రి జిల్లా:ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం వేల్పుపల్లి,ఇబ్రహీంపూర్ గ్రామాల్లో తాటి,ఈత చెట్లను ధ్వంసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా గౌడ సంఘము అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు,తుర్కపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో భూములు కొనుగోలు చేసుకుని వ్యాపారం చేసుకోవడంలో తప్పులేదని, కానీ,అట్టి భూములలో ఉన్న గౌడ జాతీ జీవనాధారమైన తాటి,ఈత వనాలను పూర్తిగా ధ్వసం చేస్తూ గౌడ కుటుంబాల పొట్టకొట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 The Real Estate Mafia That Removed The Palm And Swimming Trees-TeluguStop.com

వెంటనే సంబంధిత ఎక్సయిజ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి బాద్యులైన రీయల్ మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో గౌడ కులస్థులతో కలిసి పేద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube