ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
కాగా ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ రిట్ పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.ఇప్పటికే ప్రభుత్వం తరపు వాదనలు పూర్తి కాగా.
ప్రతివాదుల తరపు వాదనలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.
రేపు మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది.