ప్రస్తుతం దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ప్రబలుతుండటంతో ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.అయితే తాజాగా ఓ వ్యక్తి తన కూతురికి కరోనా వైరస్ సోకిందా నే ఈ విషయాన్ని పోలీసు అధికారులు దగ్గర దాచిపెట్టడమే గాక కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు గాను పోలీసులు అతడిపై పలు సెక్షన్ల పై కేసు నమోదు చేసిన ఘటన ఆగ్రా ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే మధ్య కాలంలో తన కూతురికి వివాహం చేశాడు.అయితే వివాహానంతరం కూతురు మరియు అల్లుడు కలిసి విదేశాలలో హనీమూన్ కోసం వెళ్లారు.అయితే హనీ మూన్ ముగించుకొని తిరిగి భారతదేశానికి వచ్చే సమయంలో వారికి కరోనా వైరస్ సోకినట్లు పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
దీంతో ఆ వ్యక్తి అల్లుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించగా పాజిటివ్ గా ధ్రువీకరించారు.అయితే ఇతడు ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతంలో ఉద్యోగం నిమిత్తమై నివాసం ఉంటున్నాడు.
కానీ తన భార్య మాత్రం ఆగ్రాలోని ఉండటంతో కర్ణాటక పోలీసులు అగ్ర పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే అప్రమత్తమైనటువంటి ఆగ్రా పోలీసులు వివాహిత ఉన్నటువంటి ఇంటికి వెళ్లగా ఆమె తండ్రి తన కూతురు లేదంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు.అయితే ఆ సమయంలో వివాహిత ఇంట్లోనే ఉండడంతో పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని వైద్య చికిత్సల నిమిత్తమై దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.అయితే కరోనా వైరస్ సోకినటువంటి వివాహితని ఇంట్లోనే ఉంచుకొని ఆమెకు సరైన వైద్యం అందించకుండా ఉన్నటువంటి ఆమె తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని అతడిపై కేసు నమోదు చేశారు.