హెచ్ -1 బీ వీసాల మంజూరుకు ఇచ్చే డాక్యుమెంట్స్ లో తప్పుడు సమాచారం పొందు పరిచినందుకు గాను భారత సంతతికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు అమెరికా పోలీసులు.శాంతాక్లారాకు చెందిన కిషోర్ దత్తాపురం, ఆస్టిన్ కి చెందినా కుమార్ అశ్వపతి, శాన్జోస్కు చెందిన సంతోష్ గిరి ఈ ముగ్గురు వీసా దరఖాస్తుల్లో అక్రమాలకు పాల్పడ్డారని అమెరికా న్యాయ శాఖ తెలిపింది.
భారత్ కి చెందిన సాంకేతిక నిపుణులతో పాటు ఇతరదేశాలకు చెందిన వారికి తాత్కాలిక ప్రాతిపదికపై వీసాలు ఇచ్చి అమెరికా కంపెనీలకి పని చేసే అవకాసానికి హెచ్-1బి వీసా కార్యక్రమం అనుమతి ఇస్తుంది.అందుకు గాను ఎంప్లాయర్ కాని, స్పాన్సరర్ కాని “1-129” దరఖాస్తును అమెరికా సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్కు సమర్పించాల్సి ఉంటుంది.
అయితే అందులో ఉద్యోగి చేయబోయే ఉద్యోగంతో పాటు గతంలో ఆ ఉద్యోగి పొందిన హోదా ,వేతనం , అన్నీ కూడా తెలియచేయాల్సి ఉంటుంది.అయితే ఈ ముగ్గురు భారతీయులు శాంతాక్లారా కేంద్రంగా ఒక కన్సల్టింగ్ సంస్థను ఏర్పాటు చేశారు.
సాఫ్ట్వేర్, ఇతర రంగాలలో నైపుణ్యం గల ఉద్యోగులకు ఉపాధి కల్పించే సేవలను అందిస్తున్నట్టు పేర్కొన్నారు కానీ వారు సమర్పించిన వివరాలు అన్నీ తప్పుడు సమాచారం అని తెలుసుకున్న అధికారులు వారిపై చర్యలు చేపట్టారు.
.