పవన్ పై విమర్శలు చేసిన పోసాని కి టీడీపీ అధ్యక్షుడు వార్నింగ్..!!

నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.పవన్ కళ్యాణ్ అభిమానులు దారుణంగా ఇంటిలో ఉన్న ఆడవాళ్లపై బండ బూతులు తిడుతున్నారు అని లేనిపోని అక్రమ సంబంధాలు వ్యాఖ్యలు చేస్తున్నారని.

 Tdp President Warns Posani Against Pawan Atchan Naidu,  Pawan Kalyan, Tdp-TeluguStop.com

పవన్ పై.పోసాని మండిపడిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చం నాయుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన పోసాని కృష్ణమురళి పై సీరియస్ వ్యాఖ్యలు చేస్తూ.ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది.

వైయస్ జగన్ కావాలని.పవన్ నీ .తిట్టిస్తున్నాడని.ఆ ప్రెస్ నోట్ లో తెలియజేశారు.

అచ్చెన్నాయుడు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఈ విధంగా ఉంది.“పవన్ కల్యాణ్ విషయంలో పోసాని మాట్లాడిన బూతులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి.ఇలాంటి భాషను ప్రయోగించి సంస్కృతీ సంప్రదాయాలను మంటగల్పుతున్నారు.పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యుల గురించి పోసాని చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ రెడ్డి ఎందుకు ఆపడం లేదు? సామాన్య ప్రజలు కనీసం వినలేని.మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.వాళ్లు అలా మాట్లాడుతుంటే తాడేపల్లిలో జగన్ రెడ్డి ఆనంద పడిపోతున్నారు.మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులైనా ఇలా మాట్లాడతారా?” అని అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube