టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంపై రేవంత్ రెడ్డి విమర్శలు

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారడంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.తెలంగాణకు కేసీఆర్ కు పేగుబంధం లేదని చెప్పారు.

 Revanth Reddy's Criticism Of Trs Becoming Brs-TeluguStop.com

పరోక్షంగా రెండు రాష్ట్రాలను కలిపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.తెలంగాణతో కేసీఆర్ కు పేగు బంధంతో పాటు పేరు బంధం కూడా తెగిపోయిందని విమర్శించారు.

తెలంగాణ ప్రకటన వచ్చిన రోజే టీఆర్ఎస్ పేరు మారుస్తున్నారన్న రేవంత్ రెడ్డి ఇది తెలంగాణకు బ్లాక్ డే అని తెలిపారు.బీఆర్ఎస్ పేరుపై అభ్యంతరం చెప్పడానికి ఢిల్లీకి వెళ్లానన్నారు.

ఢిల్లీలో ఐదు రోజులున్నా ఈసీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని వెల్లడించారు.ఈ క్రమంలోనే తన అభ్యంతరాలను వివరిస్తూ రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube