తుంగతుర్తి నియోజకవర్గంలోని మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది.రెండు భారీ క్రేన్ లతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన చేస్తుండగా క్రేన్ బెల్టు దిగి కిందపడడంతో ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో పలువురు భక్తులకు గాయాలు కావడంతో వారిని హుటాహుటిన హాస్పిటల్ తరలించారు.ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అపశృతి జరగడంతో గ్రామ ప్రజలు,భక్తులు అపచారంగా భావిస్తున్నారు.ఘటన స్థానానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.