యాదాద్రి జిల్లా:యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో ఒక ప్రవేటు హోటల్ పై నుండి గురువారం అర్ధరాత్రి సమయంలో కుటుంబ కలహాలతో లాడ్జిపై నుంచి దూకి తండ్రీ కూతురు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటన కలకలం రేపింది.వారు రాసిన సూసైడ్ నోట్ ప్రకారం వారు లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చినట్లు సమాచారం.
మృతులు హైదరాబాద్ లింగంపల్లికి చెందిన తండ్రి కూతురు చెరుకూరి సురేష్(40), శ్రేష్ఠ(6)గా గుర్తింపు.ఈ మధ్య తరచుగా భార్యభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిరాదరణకు వచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.