టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు.తన కుటుంబానికి చరిత్ర లేకున్నా మంత్రిని అయ్యానని తెలిపారు.
మీ తాత, తండ్రి సీఎంలు అయినా నువ్వు మాత్రం ఎమ్మెల్యే కూడా కాలేకపోయావంటూ విమర్శించారు.నెల్లూరు సిటీలో ఇద్దరం తలపడదాం రా అంటూ అనిల్ సవాల్ చేశారు.2024లో తన గెలుపుని ఆపగలిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు.నువ్వు ఓడిపోతే 2024 తరువాత రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని ప్రశ్నించారు.ఈక్రమంలోనే తనను ఓడించేందుకు టీడీపీ రూ.200 కోట్లు సిద్ధం చేసిందని ఆరోపించారు.