నెల్లూరు కోర్టులో ఫైల్స్ చోరీ కేసులో సీబీఐ దర్యాప్తు..!

నెల్లూరు కోర్టులో ఇటీవల ఫైల్స్ చోరీ అయిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా సీబీఐ అధికారులు నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు.

 Cbi Investigation In File Theft Case In Nellore Court..!-TeluguStop.com

కాగా అధికారులు చెన్నై నుంచి వచినట్లు సమాచారం.ఈ క్రమంలో సీబీఐ కొందరు పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తుంది.

అయితే, టీడీపీ నేత సోమిరెడ్డికి భారీగా ఆస్తులు ఉన్నాయని, కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు అప్పటి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి.దీనిపై స్పందించిన సోమిరెడ్డి కాకాణిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

ఈ క్రమంలో కాకాణి విడుదల చేసిన డాక్యుమెంట్లు ఫేక్ అని ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు.ఈ కేసు కోర్టు విచారణలో ఉండగానే ఏప్రిల్ లో చోరీ జరిగింది.

గుర్తు తెలియని వ్యక్తులు కోర్టులోకి చోరబడి విలువైన పత్రాలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లారనే ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలోనే కాకాణికి సంబంధించిన పత్రాలు కూడా మాయం అయినట్లు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube