ములుగులో మంత్రి కేటీఆర్ పర్యటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు.ఎవరు ఎన్నికలప్పుడు వస్తారో ప్రజలకు బాగా తెలుసని చెప్పారు.
ములుగును టార్గెట్ చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు.బీఆర్ఎస్ కు రాంరాం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని విమర్శించారు.తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజా సేవే లక్ష్యంగా భావిస్తున్న తనను ఓడిస్తామంటున్నారన్నారు.అయితే తన సేవలను ప్రజలు గుర్తిస్తారని తెలిపారు.