కన్న కొడుకులు కాదు కసాయి కొడుకులు.. నవ్వుల పాలైన పేగు బంధం.. !

అమ్మ అనే పదం అమృతం కన్న తీపిది అంటారు కవులు.కానీ నేటి కాలంలో కన్న పేగు, కడుపున పుట్టిన వారికి భారం అవుతుంది.

 Atrocities In Jammikunta The Woman That Corona Came Jammikunta, Atrocities, Wom-TeluguStop.com

అమ్మ అంటే విషపు పురుగులా చూస్తున్నారు కసాయి ఆ కొడుకులు.పిల్లలు పుట్టినప్పటి నుండి పెళ్లి చేసుకునే వరకు కన్న పిల్లల కోసం తల్లి పడే వేదన కొంచెం అయినా జ్ఞాపకానికి రావడం లేదు కొడుకులని చెప్పుకుంటున్న బండరాళ్లకు.

ఇకపోతే కరోనా బారిన పడ్ద ఓ తల్లి అందరు ఉండి కూడా అనాధగా మరణించిన విషాద ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో చోటు చేసుకుంది.ఈ మహిళకు కరోనా సోకడంతో పేగు తెంచుకున్న కొడుకులు దరికి రానివ్వలేదు.

ఇంటి యజమాని వెల్లగొట్టాడు.దీంతో ఆ తల్లికి తల దాచుకోవడానికి చోటు దొరకక పాత వ్యవసాయ మార్కెట్లో జాగారం చేసింది.

అక్కడి వ్యాపారులు వెల్లగొట్టడంతో ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న తోపుడు బండే దిక్కయింది.అక్కడ్ నిస్సహాయ స్థితిలో పడుకొని ఉండగా మానవత్వం ఉన్న ఓ వ్యక్తి వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారట.

వెంటనే స్పందించిన వారు ఆ మహిళను అంబులెన్సులో కరీంనగర్ ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు.కాగా నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున ఆ మహిళ మృతి చెందడం విషాదకరం.

మేధావులు నివసిస్తున్న ఈ సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube