కిర్గిజ్‎స్థాన్‎లో తెలుగు విద్యార్థి మృతి..!

కిర్గిజ్‎స్థాన్‎లో తెలుగు విద్యార్థి మృత్యువాత పడ్డారు.వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన దాసరి చందు( Dasari Chandu ) అనే యువకుడు మంచు జలపాత సందర్శనకు వెళ్లి మరణించాడు.

 Telugu Student Died In Kyrgyzstan , Dasari Chandu , Kyrgyzstan , Telugu Studen-TeluguStop.com

మృతుడు చందు ఏపీలోని అనకాపల్లి( Anakapalle district ) జిల్లా మాడుగుల మండలం మాడుగుల గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు.ఏడాది కిందట చందు ఎంబీబీఎస్( MBBS ) విద్యను చదివేందుకు కిర్గిజ్‎స్థాన్‎ వెళ్లాడని తెలుస్తోంది.

తాజాగా పరీక్షలు ముగియడంతో యూనివర్సిటీ అధికారులు విద్యార్థులను మంచు జలపాతం సందర్శనకు తీసుకెళ్లారు.ఈ క్రమంలోనే ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు సరదాగా మంచు జలపాతంలోకి దిగారు.వీరిలో చందు మంచులో ఇరుక్కుని పోవడంతో మృత్యువాత పడ్డారు.కాగా చందు మృతదేహాన్ని స్వస్థలం తీసుకువచ్చేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube