‘భారత్ న్యాయ యాత్ర’ పేరుతో రాహుల్ గాంధీ మరో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు.‘భారత్ న్యాయ యాత్ర’ పేరుతో యాత్రను చేపట్టనున్నారు.

జనవరి14 వ తేదీన ప్రారంభం కానున్న ఈ యాత్ర మార్చి 30 వరకు కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో మొత్తం 85 జిల్లాల్లో రాహుల్ యాత్ర సాగనుండగా మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర జరగనుంది. బస్సు యాత్ర, పాదయాత్ర ఈ యాత్ర సాగనుందని తెలుస్తోంది.

ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ న్యాయ కోసం భారత్ న్యాయ యాత్రను రాహుల్ గాంధీ చేపట్టనున్నారు.కాగా ఇటీవల నిర్వహించిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా భారత్ న్యాయ యాత్ర చేపట్టాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ ప్రధాన కార్యకర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.

సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు