రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము నకు చెందిన దొడ్ల సంజీవ్ ఈ నెల 5 న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాద్యాయులకు ఇచ్చే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కు ఎంపికయ్యారు.తన తండ్రి దొడ్ల కృష్ణయ్య ప్రభుత్వ ఉపాద్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందారు.
మొదట ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట లో గల ప్రభుత్వ పాఠశాలలో మొదటి పోస్టింగ్ తర్వాత బండలింగంపల్లి లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం ఉపాద్యాయులు గా పనిచేశారు.
ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జీవ శాస్త్రము బోధిస్తున్నారు.
కాగ ఈ నెల 5 న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా అందించే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కు ఎంపికయ్యారు సంజీవ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కు ఎంపిక కావడం పట్ల ఎల్లారెడ్డి పేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ లు హర్షం వ్యక్తం చేశారు.