ప్లీనరీ ప్రతినిధుల సభను విజయవంతం చేసిన బిఆర్ ఎస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు..

బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ప్రతినిధుల సభను విజయవంతం చేసిన ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ఎల్లారెడ్డిపేట బిఆర్ ఎస్ పార్టీ జెడ్పిటిసి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ ప్లీనరీ లో పాల్గొని విజయవంతం చేసిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

 Thanks To Leaders Of The Brs Party Who Made The Plenary House Of Representative-TeluguStop.com

ప్లీనరీ ద్వారా అందుకున్న సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులందరు పనిచేయాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కొలకాని శంకర్, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు మీసం రాజం , ఎలగందుల నరసింహులు , లద్దునూరి తిరుపతి యాదవ్ ,మేగి నర్సయ్య , ఎం డి ధర్వేష్ , బందారపు బాల్ రెడ్డి లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube