రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామానికి చెందిన ఎర్రవెల్లి కొమురయ్య, చిలువేరు సంజీవరెడ్డి, నాయిని వంశీ, కర్ల ఎల్లవ్వ లు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందగా వారి కుటుంబాలను మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరామర్శించి, వల్లంపట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పండుగ భాస్కర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారిని పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, సెస్ డైరెక్టర్ రవిందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ-వెంకటనర్సింహా రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జంగిటి రమేష్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.