రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞానదీప్ హై స్కూల్ కు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి, జోనల్ స్థాయి క్రీడలకు ఎంపికైనందున ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి జి కృష్ణ హరి క్రీడలలో రాణించిన విద్యార్థులకు మెమొంటో ఇచ్చి అభినందించారు .అనంతరం విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరమని అన్నారు .
సుల్తానాబాద్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్ 17 వాలీబాల్ బాలుర విభాగంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన ఐ.గణేష్ ను మండల విద్యాధికారి కృష్ణ హరి అభినందించి షీల్డ్ మరియు మెడల్ ప్రధానం చేశారు.
అనంతరం కరీంనగర్ జోనల్ స్థాయి అండర్ 17 కబడ్డీ బాలుర విభాగంలో ఈ .నవనీత్ అండర్ 17 కోకో బాలుర విభాగంలో జి .భాను ప్రసాద్ అండర్ 14 కోకో బాలుర విభాగంలో సిహెచ్ .నవనీత్ అండర్ 14 కబడ్డీ బాలిక విభాగంలో బి .తన్విక అండర్ 14 వాలీబాల్ బాలుర విభాగంతో పాటు లాంగ్ జంప్ జిల్లా స్థాయిలో రెండవ స్థానం కైవసం చేసుకున్న సిహెచ్ రవి ప్రకాష్ లను అభినందించి ఈనెల 28 నుంచి తలపెట్టే రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధంగా ఉండి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి కి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.చదువుతోపాటు క్రీడలలో రాణించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని విద్యాధికారి కృష్ణ హరి విద్యార్థులను ఆకాంక్షించారు .అనంతరం పాఠశాల కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ , వ్యాయామ ఉపాధ్యాయులు అరుణ్ , మధులను అభినందించారు.