ప్రారంభమైన ఆలయ గోపురం -కేశవ పెరమండ్ల ఆలయ గోపురం నిర్మాణం

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఆలయ గోపురం నిర్మాణానికి పూజ చేసి ప్రారంభించిన ఆలయ కమిటీ.ఎల్లారెడ్డిపేట(Ellareddypet) శ్రీ లక్ష్మీ కేశవ పెరమాండ్ల ఆంజనేయస్వామి దేవాలయం( మాఘ అమావాస్య గుట్ట జాతర) ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా గురువారం పనులు మొదలు పెట్టారు.

 Temple Gopuram Started-construction Of Kesava Peramandla Temple Gopuram, Kesava-TeluguStop.com

ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాట్లాడుతూ ఆలయ గోపురం నిర్మాణం పనులు చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా భక్తుల సహకారంతో ఆలయం పనులు దశలవారీగా నిర్మాణం చేశామని వివరించారు.

పునర్నిర్మాణం కొరకు ధన రూపేన, వస్తు రూపేన సహకరిస్తున్న భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.గోపురం పనులు త్వరగానే పూర్తి చేస్తామని చెప్పారు .ఈ కార్యక్రమంలో పెరమండ్ల ఆలయ చైర్మన్ పారిపెల్లి రామ్ రెడ్డి, వైస్ చైర్మన్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి,రైటర్ గుండాడి వెంకటరెడ్డి, వంగ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube