సహాయ పౌండేషన్ అధ్యక్షునిగా లద్దు నూరి వెంకటరమణ

రాజన్న సిరిసిల్ల జిల్లా :సహాయ పౌండేషన్ నూతన అధ్యక్షునిగా లద్దునూరి వెంకటరమణ( Venkataramana ) ఎన్నికయ్యారు.ఎల్లారెడ్డిపేటకు చెందిన పూర్వ విద్యార్థులు 1995 -96 బ్యాచ్ సహాయ పౌండేషన్ ఏర్పాటు చేసి అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఈ సంస్థ ద్వారా ఆర్థిక సహాయంతో పాటు బియ్యం వితరణ చేస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.

 Laddu Noori Venkataramana As The President Of Sahaya Foundation , Venkataramana-TeluguStop.com

అదేవిధంగా ప్రతి దసరా సందర్భంగా నిరుపేదలకు దుస్తులను పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ సందర్భంగా ఆదివారం నూతన కమిటీని ఎన్నుకొని అధ్యక్షునిగా లద్దునూరి వెంకటరమణ,ఉపాధ్యక్షులుగా దుబ్బాక సతీష్, ప్రధాన కార్యదర్శిగా షాదుల్ బాయ్, కోశాధికారిగా సద్ది రాజిరెడ్డి , సహాయ కార్యదర్శిగా సంతోష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ సహాయ ఫౌండేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని నిరుపేదలను ఆదుకుంటామని పేర్కొన్నారు.తమ ఎన్నికకు సహకరించిన ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube