సహాయ పౌండేషన్ అధ్యక్షునిగా లద్దు నూరి వెంకటరమణ

రాజన్న సిరిసిల్ల జిల్లా :సహాయ పౌండేషన్ నూతన అధ్యక్షునిగా లద్దునూరి వెంకటరమణ( Venkataramana ) ఎన్నికయ్యారు.

ఎల్లారెడ్డిపేటకు చెందిన పూర్వ విద్యార్థులు 1995 -96 బ్యాచ్ సహాయ పౌండేషన్ ఏర్పాటు చేసి అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఈ సంస్థ ద్వారా ఆర్థిక సహాయంతో పాటు బియ్యం వితరణ చేస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.

అదేవిధంగా ప్రతి దసరా సందర్భంగా నిరుపేదలకు దుస్తులను పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ సందర్భంగా ఆదివారం నూతన కమిటీని ఎన్నుకొని అధ్యక్షునిగా లద్దునూరి వెంకటరమణ,ఉపాధ్యక్షులుగా దుబ్బాక సతీష్, ప్రధాన కార్యదర్శిగా షాదుల్ బాయ్, కోశాధికారిగా సద్ది రాజిరెడ్డి , సహాయ కార్యదర్శిగా సంతోష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ సహాయ ఫౌండేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని నిరుపేదలను ఆదుకుంటామని పేర్కొన్నారు.

తమ ఎన్నికకు సహకరించిన ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ముసలాయనపై అడవి పంది అటాక్‌.. ఒళ్లు గగుర్పొడిపించే వీడియో వైరల్..